మమతకు సిఎం రోశయ్య కృతజ్ఞతలు

కేంద్ర మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పట్ల ముఖ్యమంత్రి రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులు కేటాయించినందుకు మమతకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన లేఖ రాశారు. గతంలో తాను జరిపినఢిల్లి పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీలతో రైల్యే బడ్జెట్‌పై చేసిన సంప్రదింపులు ఫలించాయని సిఎం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర వాటా విడుదల చేసేందుకు సిద్థమేనని రోశయ్య ఆ లేఖలో స్పష్టం చేశారు.